పోస్ట్‌లు

నవంబర్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Bhavannarayana Swamy Temple, Bapatla

చిత్రం
శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం   ఆంధ్రప్రదేశ్ లోని పురాతన ఆలయాలలో ఒకటి బాపట్ల లో ఉన్న శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయం.  శ్రీ మహావిష్ణు అవతారాలైన శ్రీ భావన్నారాయణ మరియు చెన్నకేశవ స్వామి ఆలయాలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తాయి.  బాపట్ల, పొన్నూరు, పెద్ద  గంజాం (ప్రకాశం జిల్లా ), భావదేవరపల్లి (కృష్ణాజిల్లా. అవనిగడ్డ నుంచి 15కిలోమీటర్లు), సర్పవరం (కాకినాడ దగ్గర) ఈ అయిదు చోట్ల పురాతన శ్రీ భావన్నారాయణ స్వామి ఆలయాలు కలవు.  నైమిశారణ్యంలో అగస్థ్య మహర్షి మునులకు శ్రీ భావన్నారాయణ తత్వం గురించి విశిదీకరించారని బ్రహ్మ వైవర్తన పురాణం పేర్కొంటోంది. స్వామి భక్త రక్షకుడు. నిత్య జీవితంలో అనుకోకుండా ఆపదలలో లేదా అపవాదాలు ఎదుర్కొనే వారిని కాపాడేవాడు. దీనికి ప్రమాణం పొన్నూరు సాక్షి భావన్నారాయణ స్వామి.  స్వామివారి పేరు మీదగా భావపురి గా పిలువబడి, కాలక్రమంలో బాపట్లగా మారిన ఈ ఊరిలో స్వామి కొలువు తీరడం వెనక ఉన్న పురాణ గాధ ఇదుమిద్దంగా తెలియరాలేదు.  కానీ  ఆలయాన్ని ఆంధ్రదేశం మీద లభించిన విజయానికి నిదర్శనంగా చోళ రాజులు నిర్మించారని తెలుస్తోంది.  ...

Pandalam

చిత్రం
                                              పందళం   హరిహర సుతుడు శ్రీ ధర్మశాస్త పందళ రాజకుమారునిగా  ప్రసిద్దికెక్కారు. శ్రీ మణి కంఠునిగా ఆయన పావన పంపాతీరాన రాజు రాజశేఖరునికి పసి బాలునిగా లభించారని గాధలు తెలుపుతున్నాయి.  దైవాంశ సంభూతుడు  రాజమహల్ లో తన బాల్యాన్ని గడపడం వలన పందళం ఒక పవిత్ర దర్శనీయ స్థలంగా గుర్తించబడినది. ముఖ్యముగా కార్తీక మాసం నుండి పుష్యమాసం  వరకు అంటే మూడు నెలల కాలం దేశం నలుమూలల నుండి భక్తులు శబరిమలకు తరలి వస్తుంటారు.  అందరూ తప్పనిసరిగా పందళం సందర్శించుకొంటారు.  మహిషి సంహారం తరువాత  పందళ వంశం వారు శ్రీ మణికంఠుని తమ కులదైవంగా భావించారు. ఆయనకొక  ఆలయాన్ని రాజ భవన సముదాయం మధ్యలో నిర్మించారు. అదే "వళియ కోయిక్కల్ ఆలయం".  అసలు పందళం రాజ వంశీకులు మధురైని పాలించిన "పాండ్య వంశీ"కులని అంటారు. ఏవో కొన్ని కారణాల మూలంగా పాండ్య వంశీకులు కొందరు ఇక్కడికి తరలివచ్చి సామ్రాజ్యాన్ని స్థాపించారన...