పోస్ట్‌లు

అక్టోబర్, 2017లోని పోస్ట్‌లను చూపుతోంది

Dhanushkodi

చిత్రం
                                          ధనుష్కోడి   అవతార పురుషుడు శ్రీ రామచంద్రుడు తన ధనుస్సు తో తట్టి ఎక్కడ వారధి కట్టాలో నిర్ణయించారు. అదే విధంగా రావణ సంహారం తరువాత అదే ధనుస్సు కొనతో ఆ వారధిని కూల్చారట ! అందుకనే "ధనుష్కోడి" అన్న పేరు వచ్చినది.  భారత భూభాగం నుండి సముద్ర జలాల కారణంగా విడిపోయిన రామేశ్వరం లేదా పాంబన్ ద్వీపకల్పంలోని తూర్పుకోనన ఉంటుంది ధనుష్కోడి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరానికి 25కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రామేశ్వరాన్ని ప్రధాన భూభాగముతో కలిపేందుకు 1914 వ సంవత్సరంలో "పాంబన్ బ్రిడ్జి"అని పిలిచే రైలు వంతెన నిర్మించారు. ఇదొక అద్భుత నిర్మాణం. ఎంతో  లోతైన సముద్రజలాలలో నిర్మించారు. ఈ రెండున్నర కిలోమీటర్ల వంతెన మధ్య భాగంలో, జలాల్లో పడవలు వచ్చినప్పుడు పైకి లేచి దారి ఇస్తుంది. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతం. 1988 దాకా రామేశ్వరం చేరడానికి ఒక్క రైలు మార్గమే ఉండేది. 1974లో రోడ్డు బ్రిడ్జి కట్టడానికి శంకుస్థాపన జరిగింది. ప్రకృతి...