పోస్ట్‌లు

ఏప్రిల్, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Kunti Madhava Swamy Temple, Padmanabham

చిత్రం
            శ్రీ కుంతీ మాధవ స్వామిఆలయం, పద్మనాభం   ఎక్కడో ఉత్తర భారత దేశంలో ఉన్న హస్తినా పురి కి చెందిన పాండవుల నిర్మాణాలుగా పేర్కొనే ఎన్నో ఆలయాలు దక్షిణ భారత దేశంలోని అయిదు రాష్ట్రాలలో కనిపిస్తూ ఉండటం ఎంతో అబ్బురంగా అనిపిస్తుంది.  రవాణా సదుపాయాలు అతి తక్కువగా, ప్రయాణంలో లెక్కలేనన్ని ఇబ్బందులు ఉండే ఆ కాలంలో వారు ఇంత దూరాలు ఏ విధంగా ప్రయాణించారో  !!! తమిళనాడు మహాబలిపురం లోని పంచ పాండవ రధాలు, కేరళ లోని పంచ పాండవ శ్రీ కృష్ణ ఆలయాలు వీటిల్లో కొన్ని ! మన తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పాండవ నిర్మిత ఆలయాలు కనపడతాయి.  మన రాష్ట్రంలో ఒడిస్సా సరిహద్దులలో ఉన్న మహేంద్ర గిరులలో ఉన్న పెక్కు పురాతన నిర్మాణాలను పాండు నందనులచే నిర్మించబడినవిగా తెలుస్తోంది.  అదే కోవకు చెందిన మరో చరిత్ర ప్రసిద్ద  స్థలం "పద్మనాభం".  సుందర సాగర తీర నగరం విశాఖ పట్టణానికి సుమారు ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్మనాభంలో తమ తల్లి కుంతీ దేవితో పాటు పంచ పాండవులు వనవాస కాలంలో కొంత కాలం ఇక్కడ నివసించారని స్థానికంగా ప్రచారంలో ఉన...

Nandyal - Nava Nandi Kshetram

చిత్రం
                                  నవనందుల క్షేత్రం - నంద్యాల   మన దేశంలో నెలకొన్న అనేకానేక ఆలయాలలో ప్రధాన అర్చనామూర్తి తో పాటు ఉప దేవతలు ఎందరో కొలువు తీరి ఉంటారు.  అందరినీ సందర్శించి సేవించుకోవడం శుభప్రదంగా భావిస్తారు భక్త జనం.  కానీ ఒకే దైవం ఒక ప్రాంత పరిసరాలలో లేదా కొన్ని పవిత్ర ప్రదేశాలలో ఒకే కారణంతో లేదా ప్రత్యేక విశేషంతో కొలువై ఉండిన దివ్య క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.  అష్ట వీరట్ట క్షేత్రాలు, సప్త మాంగై స్థలాలు, పంచ భూత స్థలాలు, పంచ  నాట్య సభలు, నవ కైలాసాలు, పంచ పాండవ ఆలయాలు, పంచ ధర్మశాస్త ఆలయాలు లాంటివి తమిళనాడు మరియు కేరళలోనెలకొని ఉండగా   పంచారామాలు, పంచ భావన్నారాయన, పంచ శ్రీ వల్లభ క్షేత్రాలు, పంచ నారసింహ ఆలయాలు  మన రాష్ట్రంలో ఉన్నాయి.  ఇవన్నీ ఒక ఎత్తయితే కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల పరిధిలో నేకొని ఉన్న నవ నందులు విశేష పౌరాణిక మరియు చారిత్రిక కలిగినవిగా పేర్కొనవచ్చును.  పాండు వంశాని...