పోస్ట్‌లు

2016లోని పోస్ట్‌లను చూపుతోంది

Tiruttani

చిత్రం
             శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, తిరుత్తణి   తమిళనాడులో ఆదిదంపతుల ముద్దుల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అధికం. ప్రతి శివ, శక్తి, గణపతి ఉప దేవతగా మరియు మరెన్నో ఆలయాలలో ప్రధాన అర్చా మూర్తిగా సేవలందుకొంటున్నారు షణ్ముఖుడు.  అలాంటి వాటిల్లో ఆరు పాడై వీడు ఆలయాలు ముఖ్యమైనవి. అవి పళని, స్వామిమలై,  తిరుప్పరం కుండ్రం, పళముదిర్చోళై, తిరుత్తణి మరియు తిరుచ్చెందూర్. గమనించదగిన అంశం ఏమిటంటే మొదటి అయిదు ఆలయాలు పర్వతాల మీద నెలకొని ఉండగా, ఆఖరిదైన తిరుచ్చెందూర్ మాత్రం సముద్ర తీరాన ఉండటం. ఒకప్పుడు ఇక్కడ కూడా పర్వతం ఉండేదట. సముద్ర అలల తాకిడికి కరిగిపోయింది అని చెబుతారు. ఆలయ అంతర్భాగంలో ఆ కొండా తాలూకు చిన్న భాగాన్ని చూడవచ్చును.   సుబ్రహ్మణ్య షష్టి లాంటి విశేష పర్వదినాలలోనే కాకుండా  ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు ఈ ఆలయాలకు తరలి వస్తుంటారు. ఈ ఆరు ఆలయాలు  తమవైన పురాణ, చారిత్రక నేపధ్యం కలిగి ఉంటాయి.  ఆరు పాడై వీడు ఆలయాల వరుసలో ఐదవది అయిన తిరుత్తణి ఆలయానికి సంబంధించిన పురాణగాథ తొలి ...

Sri Chitra Gupta Temple, Kanchipuram

చిత్రం
                                శ్రీ చిత్రగుప్త స్వామి ఆలయం   ఈ పేరు వినగానే మన కనుల ముందు ఒక చిత్రమైన రూపం మెదులుతుంది. పెదవుల మీదకు నవ్వు వస్తుంది. కానీ చిత్రగుప్తుడు సామాన్యుడు కాదు. సృష్టికర్త బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించినవాడు.  విధాతకు తెలియ కుండా ఆయన కాయంలో (దేహంలో) దాగి ఉండి ఆయనకు తెలియ కుండా బయటకు వచ్చిన చిత్ర మైన వాడు గనుక ఈయనకు చిత్రగుప్తుడు అన్న పేరొచ్చినది. భూలోకం లోని ప్రాణులు తమ జీవితాలలో చేసిన అన్ని పనులను నమోదు చేసేవాడు.వాటిని బట్టి మరణానంతరం నరకమా ? స్వర్గమా ? అన్నది తెలిపేవాడు. అత్యంత మేధావి. సునిశిత పరిశీలన గలవాడు.అసలు చిత్రగుప్తుడు అంటే అన్ని విషయాలను గుప్తంగా ఉంచేవాడు అని కదా అర్ధం ! దానిని నిరంతరం నిలబెట్టుకునే వాడు చిత్రగుప్తుడు. అసలు తొలిసారి అక్షర మాలను, సంఖ్యలను రాసినవాడు చిత్రగుప్తుడే ! ఇన్ని విశేషాలు ప్రత్యేకతలు కలిగి చతుర్ముఖుని దేహం నుండి ఆవిర్భవించిన వాడు నరకంలో ఉంటూ సతతం జీవుల పాపపుణ్యాలను లిఖించడం ఏమిటి ? ఈయన జన్మ వృత్తాంతం మరియు లక్...

Greetings

చిత్రం
వెలుగులు చిందే ఈ దీపావళి అందరికీ శుభాలు చేకూర్చాలని, సుఖ శాంతులు అందించాలని, జీవితాలలో సరికొత్త కాంతులు నింపాలని ఆ సర్వేశ్వరుని ప్రార్ధిస్తున్నాను. 

Sri Manakula Vinayaka Temple, Puducherry

చిత్రం
                            శ్రీ మనకూల వినాయక ఆలయం   తొలి పూజ్యుడు, ఆది దంపతుల కుమారుడు శ్రీ గణపతికి మన దేశ నలుమూలలా ఎన్నో ఆలయాలు నెలకొల్పబడ్డాయి. అలాంటి వాటిల్లో పాండిచ్చేరి (పుదుచ్చేరి)లో ఉన్న శ్రీ మనకూల వినాయక ఆలయం ప్రత్యేకమైనది. ప్రస్తుత ఆలయం నూతన నిర్మాణమైనప్పటికీ ఇక్కడ విఘ్ననాయకుడు ఎన్నో శతాబ్దాల నుండి కొలువై పూజలందుకొంటున్నారు  చారిత్రక ఆధారాల వలన అవగతమౌతోంది.ఒకప్పుడు ఆలయం మున్న ప్రాంతం ఫ్రెంచ్ వారి ఆధిపత్యంలో ఉండేది.వారి కార్యాలయాలు, గృహాలు ఈ ప్రాంతంలో ఉండేవి. తమ నివాసం ఉన్న చోట  హిందువుల దేవత ఉండటం నచ్చని వారు ఆలయాన్ని తొలగించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి మూలవిరాట్టును సముద్రంలో పడవేశారు. అయినా వారి యత్నాలు ఫలించలేదు. సాగరంలో పడివేసిన ప్రతిసారీ విగ్రహం కెరటాలతో కదలివచ్చి ఇదే ప్రదేశానికి తిరిగి చేరుకొనేదిట.ఇది చూసిన స్థానికులు ఫ్రెంచి వారి మీద తిరగబడి ఒక ఆలయం నిర్మించుకొన్నారు. కాలక్రమంలో భక్తుల విరాళాలతో ప్రస్తుత రూపు సంతరించుకొన్నది.  శ్రీ మ...