శ్రీ కాశీ నాయన ఆలయం, జ్యోతి జ్యోతి, గిద్దలూరు కి సుమారు ౫౦ కిలోమీటర్ల దూరం లో ఉన్నది. వయా ఓబులాపురం మీదగా బస్సులు గిద్దలూరు నుండి ఉన్నాయి. ఇక్కడే ఆలయాలలో ఉచితన్నదాన కార్యక్రమ ప్రారంభ స్ఫూర్తి ప్రదాత అవధూత శ్రీ కాశి నాయన సమాధి చెందారు. కామధేను గోవు సమాధి, శివ, శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఇతర ఆలయాలు ఇక్కడ నిర్మించారు. ప్రస్తుతం కాశి నాయన సమాధి మీద ఎందరో అవధుతలు, మహా పురుషుల, యోగుల, మహారుషుల ,దేవతల శిల్పాల తో కూడిన ఒక మహా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. చుట్టూ కొండలు, నల్లమల అడవులతో నిండిన చక్కని ప్రకృతి లో మసుకు ప్రశాంతి ని ప్రసాదించే పరిసరాల తో ఆహ్లాదకరంగా ఉండే జ్యోతి లో ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది. అన్ని జీవులకు అన్నదానం కాశి నాయన సమాధి మందిరం శ్రీ కాశి నాయన శ్రీ కాశి నాయన పంచ లోహ మూర్తి నాయన పాదుకలు నిర్మాణం లో ఉన్న ఆలయం / శిల్పాలు నవగ్రహ మండపం ...
శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నెల్లూరు శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నగరం నెల్లూరు. క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలానికే నెల్లూరు అప్పట్లో "విక్రమ సింహపురి" దక్షిణాది లోని ముఖ్య నగరాలకు కూడలిగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ప్రసిద్ది చెందినట్లుగా లభించిన శిలా శాసనాలు తెలియచేస్తున్నాయి. మౌర్య చక్రవర్తి అశోకుని నుండి పల్లవ, చోళ, కాకతీయ, శాతవాహన,పాండ్య, తెలుగు చోడ, విజయనగర ఇలా ఎన్నోరాజ వంశాలు ఈ పట్టణ సర్వతోముఖాభివృద్ది కి కృషిచేసినట్లుగా వివిధ చారిత్రిక పరిశోధనా గ్రందాల ఆధారంగా అవగతమవుతోంది. ఇలా ఎందరో రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో పురాణ ప్రసిద్దిచెందిన పురాతన ఆలయాలకు కొదవ లేదు. నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి. వీటిల్లో చాలా మటుకు అరుదైనవి కూడా! విక్రమ సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వాటిల్లో ఒకటి. స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రతినిత్యం ఎందరో భక్తులు దర్శించుకొనే ఈ అమ్మవారు సుమారు ఎనిమిదో శతాబ్దానికి పూర్వమే కొలువుతీరినట్లుగా క్షేత్ర గాధ తెలుపుత...
శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం, అడిగొప్పల అమ్మలగన్న అమ్మ లోకపావని శ్రీ పార్వతీ దేవి దేశం నలుమూలలా ఎన్నో పేర్లతో వివిధ క్షేత్రాలలో కొలువు తీరి భక్తుల సేవలను అందుకొంటున్నారు. అలాంటిదే "నిదానంపాడు అగ్రహారం". నేడు గ్రామం లేకున్నాపొలాల మధ్య అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా నమ్మిన వారిని అనుగ్రహిస్తున్నారు. ముగురమ్మల మూలపుటమ్మ ఇక్కడ పదకొండు సంవత్సరాల బాలిక రూపంలో దర్శనమివ్వడానికి సంబంధించిన గాధ తాలూకు ఆరంభం యుగాల క్రిందటిదిగా తెలుస్తోంది. చివరికి కలియుగంలో అమ్మవారు ప్రకటితమవ్వడంతో ముగిసింది అని భావించవచ్చును. ఒకనాడు కైలాసంలో నటరాజు ఆనంద తాండవం చేస్తుండగా ప్రమధ గణాలు కూడా ఆయనతో నర్తించ సాగారట. ఆ అపురూప సందర్భంలో నంది కూడా తనకు తెలిసిన విధంగా నృత్యం చేయసాగాడట. అది చూసి పార్వతీ దేవి పగలబడి నవ్వసాగారట. అక్కడే ఉన్న నంది తండ్రి "శిలాద మహర్షి" ఆగ్రహించి, "భక్తి భావంతో నర్తిస్తున్న నా కుమారుని తల్లిలా ఆదరించకుండా రూపం చూసి పరిహసించిన నీవు ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి