పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

Sri Veerabhadra Swamy Temple, Macherla

చిత్రం
                              శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, మాచర్ల     మాచర్ల పట్టణంలో ఉన్న మరో పురాతన ఆలయం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీర భద్ర స్వామి మరియు శ్రీ ఇష్టకామేశ్వర స్వామి ఆలయం.  శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే ఉంటుందీ ఆలయం.   వెయ్యి సంవత్సరాల క్రిందట చోళ రాజులు ప్రతిష్టించిన శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి ఆలయంలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట గ్రామ కరణం తమ ఇలవేల్పు అయిన శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్టించి రాజ సహకారంతో ఆలయం నిర్మించారట.   పురాతన గాలి గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది. పక్కనే శ్రీ నాగేంద్ర సన్నిధి. చుట్టలు చుట్టలుగా ఉండే ఆరు అడుగుల నాగేంద్ర పడగలో సూక్ష్మ రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని బహు చతురతతో చెక్కారు. ప్రాంగణంలో ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి.   ఆలయాన్ని నిర్మించిన శిల్పుల నాయకుని మూర...

Sri Lakshmi Chennakeshava Swamy Temple, Macherla

చిత్రం
                         శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయం, మాచర్ల                              ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విశిష్ట నేపద్యం గల ప్రాంతంగా ప్రసిద్ది చెందినది పల్నాడు.  నాటికి నేటికీ పల్నాడు ప్రాంతానికి కేంద్ర బిందువు మాచర్ల. త్రేతాయుగంలో మారీచుడు అనే రాక్షసుడు పాలించిన ప్రాంతం గా ఈ పేరొచ్చినది  అన్న ఒక కధనం స్థానికంగా వినిపిస్తుంది. శాసనాలలో "మహాదేవి తటాక " అని పేర్కోబడినది.  గత రెండు వేల సంవత్సరాలుగా అనేక రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి అని శాసనాలు నిర్ధారిస్తున్నాయి. మహాభారతాన్ని పోలిన పల్నాటి యుద్ధం చోటుచేసుకోన్నదిక్కడే ! శ్రీనాధ మహాకవి తన పల్నాటి వీర చరిత్ర కావ్యంలో నాటి ప్రజల స్థితి గతుల గురించి, జీవనవిధానం, ఆచారవ్యవహారాల, స్థానిక పరిస్థితులను, పల్నాటి వీరుల ధైర్య సాహసాల గురించి సవివరంగా తెలిపారు .  కాల గతిలో విభిన్న అంశాలలో అభివృద్ధి...