పోస్ట్‌లు

నవంబర్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

sri agastheeswara swamy temple, Mukkoti

చిత్రం
                   శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం, ముక్కోటి, తిరుపతి  సప్త మహా ఋషులలో శ్రీ అగష్య మహర్షి ప్రత్యేకత వేరు. సదా శివుని ఆజ్ఞ మేరకు కాశి నగరాన్ని వదిలి దక్షిణ భారత దేశానికి సతి, శిష్య ప్రశిష్య సమేతంగా తరలి వెళ్ళారు. మార్గంలో కాల గతిని నిర్ణయించే సూర్య చంద్రుల గతిని అడ్డుకొనే విధంగా పెరిగిన వింధ్య పర్వతాన్ని సాధారణ స్థితికి తెచ్చారు. దక్షిణ దేశంలో ప్రతి పుణ్య తీర్థ స్థలిని సందర్శించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ కారణంగానే నేడున్న అనేక శివాలయాలలో పూజలం దుకొంటున్న లింగరాజును శ్రీ అగస్థీస్వర స్వామిగా పిలవబడుతున్నారు. తన దక్షిణ భారత దేశ పర్యటనలో విడిది చేసిన అనేక స్థలాలు నేడు పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్ది పొందాయి. అలాంటి వాటిల్లో కేరళ తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న పోదిగై పర్వతాలు విశేష ప్రాముఖ్యతను సంతరించుకొన్నాయి. విధాత ఆనతి మేరకు మహా ముని ఈ ప్రాంతంలోనే సంస్కృత, తమిళ భాషలను సృష్టించారని తెలుస్తోంది. అద్భుత ప్రకృతి సౌందర్యానికి, మనసులకు ప్రశాంతతను ప్రసాదించే ఆధ్యాత్మిక వాతావరణానికి ఈ పోదిగై పర్వతాలు ప్ర...

Tirupati

చిత్రం
                  తిరుపతి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయాల విశేషాలు  శ్రీ హరి నామ సంకీర్తనలతో ప్రతిధ్వనించే పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠము గా కీర్తింపబడే పరమ పుణ్య ధామం. దశావతారాలా లేక పురాణాలలో పేర్కొన్న అనేకానేక అవతారాలా ! రూపం మారవచ్చును. కాని ముఖ్యోద్దేశం భక్త జన సంరక్షనే ! అందుకే శ్రీ వేంకటేశ్వరుడు సకల రూప అవతారం. కలియుగ దైవం. మరి ఆయనకు అత్యంత సన్నిహితంగా మసలి నిరంతరం స్వామి సేవలో ఉండిపోవాలని కోరుకొన్న ఒకే ఒక అనుచరుడు అంజనీ పుత్రుడు శ్రీ ఆంజనేయుడు. అన్ని విష్ణు క్షేత్రాలలో కేసరీ నందనునిది  ప్రత్యేక స్థానం. కాని తిరుమల తిరుపతిలో వాయు సుతునిది సమున్నత స్థానం. సప్త గిరులలో, నడక దారిలో, దిగువ తిరుపతిలో కనపడేన్ని హనుమత్ సన్నిధులు మరెక్కడా కానరావు. అన్ని ఒక ఎత్తైతే తిరుపతి పట్టణంలో ప్రఖ్యాతి గాంచిన శ్రీ గోవింద రాజ స్వామి ఆలయ నలుదిక్కులా ఉన్న అనేక సంజీవ రాయని ఆలయాలు విశేషమైనవి. ఎంతో చారిత్రక సమాచారాన్ని అందించే భండారాలు అవి. ఒకరకంగా వీటిని నాలుగు పక్కలా ఉన్న క్షేత్ర రక్షక నిలయాలుగా పేర్కొనాలి....

Sri Prasanna Venkatesa Perumal Temple.

చిత్రం
అనాదిగా ఎందరో మహానుభావులు శివ కేశవులకు భేదం లేదని తెలుపుతూ వచ్చారు. అయినా తమ దైవం గొప్ప అంటూ కత్తులు దూసుకొనే వారికి ఈ విషయాన్ని తెలపాలి అని స్వయంగా భగవానుడే నిర్ణయించుకొని కొలువైన క్షేత్రం తిరుప్పార్కడల్ ( పవిత్ర పాల సముద్రము  ). ప్రధాన అర్చనా దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పెరుమాళ్. పురాణం ప్రసిద్ది చెందిన ఈ క్షేత్రం పరిహార క్షేత్రంగా పేరొందినది.  పక్కపక్కనే ఉన్న ఆలయాలలో ఒక దానిలో శ్రీ ప్రసన్న వెంకటేశ పెరుమాళ్, రెండో దానిలో అనంత శయన శ్రీ రంగ నాద స్వామిగా కొలువు తీరిన ఏకైక స్థలం తిరుప్పార్ కడల్.  పురాణ గాధ : విధాత బ్రహ్మా కంచిలో ఆరంభించిన యాగాన్ని శాస్త్రోక్తం గా నిర్వహించిన సప్త మహా మునులు సమీపంలోని శ్రీ యోగ నారసింహ స్వామి కొలువుతీరిన " ఘటికాచలం " ( అరక్కోణం సమీపంలోని నేటి షోలింగనూరు ) కి పయనమయ్యారు. కాని వారిలో ఒకరైన "పుండరీక మహర్షి " వేరుగా బయలుదేరారు.  ఈయన అమిత విష్ణు భక్తుడు.  మార్గ మద్యలో ఉన్న విష్ణు ఆలయాలను సందర్శించుకొంటూ వైకుంఠ ఏకాదశి నాటికి ఈ ప్రాంతానికి వచ్చారు.      ...