29, సెప్టెంబర్ 2013, ఆదివారం

ARDHAGIRI SRI VEERANJANEYA SWAMY TEMPLE.

                   శ్రీ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం 




చిత్త్తూర్ జిల్లాలో ఉన్న అర్ధగిరి శ్రీ వీరాంజనేయ ఆలయం త్రేతా యుగానికి సంభందించిన సంజీవని పర్వత గాధతో ముడిపడి ఉన్నది. ఇంద్రజిత్ అస్త్రానికి మూర్చ్చిల్లిన లక్ష్మణుని తిరిగి సృహ లోనికి తీవడానికి వానర వైద్యుడు సుషేణుడు చెప్పిన ప్రకారం సంజీవని పర్వతం తేవడానికి వెళ్ళాడు ఆంజనేయుడు. 
సరైన మూలికను గుర్తించలేక పర్వతాన్నే ఎత్తుకొని తెచ్చే క్రమంలో కొంత భాగం ఇక్కడ పడినది. అందుకే అర్ధగిరి / అరకొండ అన్నపేర్లు వచ్చాయని తెలుస్తోంది. 








ఇక్కడి పుష్కరనిలోని నీరు సుద్దమైనది. ఎంతకాలమైనా వాసనరాదు, పాచి పట్టదు. అన్నిటికి మించి సర్వ రోగ నివారణి. ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులు రోగ నివారనార్ద్దం ఈ నీటిని తీసుకొని వెళ్ళుతుంటారు. 


సుందర ప్రకృతిలో ఛిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయం సందర్శకులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తుంది. 
తిరుపతి, చిత్తూరు, కానిపాకంల నుండి రోడ్ మార్గంలో సులభంగా అర్ధగిరి  చేరుకోవచ్చును. 





హనుమత్ జయంతి, శ్రీ రామ నవమి పెద్ద ఎత్తున జరుపుతారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...