పోస్ట్‌లు

సెప్టెంబర్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

Tiruvannamalai

చిత్రం
                                          శ్రీ అరుణాచలేశ్వర  పంచ భూత క్షేత్రాలలో ఒకటి తిరువన్నామలై.  సదా శివుడు పంచ భూతాలైన భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశాలకు అధిపతిగా అయిదు క్షేత్రాలలో లింగ రూపంలో కొలువై ఉన్నారు.  అవి కాంచీపురం ( పృథ్వి ), జంబుకేశ్వరం ( నీరు), శ్రీ కాళహస్తి ( వాయువు), చిదంబరం ( ఆకాశం) కాగా తిరువన్నామలై లో ఉన్నది అగ్ని లింగం.  స్వామి వారిని శ్రీ అరునాచలేశ్వరుడు అని పిలుస్తారు.  అన్నామలై పర్వత పాదాల వద్ద ఉన్న  ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు  బ్రహ్మోత్సవాలు  జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం, అన్నామలై కొండ మీద మూడు టన్నుల నెయ్యి వేసి ఓ పెద్ద జ్యోతి వెలిగిస్తారు. ప్రతి  పౌర్ణమి  నాటి రాత్రి, వేలకొలది భక్తులు అరుణాచల కొండ చుట్టూ వట్టి కాళ్ళతో  ప్రదక్షిణాలు ...

ARDHAGIRI SRI VEERANJANEYA SWAMY TEMPLE.

చిత్రం
                    శ్రీ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం  చిత్త్తూర్ జిల్లాలో ఉన్న అర్ధగిరి శ్రీ వీరాంజనేయ ఆలయం త్రేతా యుగానికి సంభందించిన సంజీవని పర్వత గాధతో ముడిపడి ఉన్నది. ఇంద్రజిత్ అస్త్రానికి మూర్చ్చిల్లిన లక్ష్మణుని తిరిగి సృహ లోనికి తీవడానికి వానర వైద్యుడు సుషేణుడు చెప్పిన ప్రకారం సంజీవని పర్వతం తేవడానికి వెళ్ళాడు ఆంజనేయుడు.  సరైన మూలికను గుర్తించలేక పర్వతాన్నే ఎత్తుకొని తెచ్చే క్రమంలో కొంత భాగం ఇక్కడ పడినది. అందుకే అర్ధగిరి / అరకొండ అన్నపేర్లు వచ్చాయని తెలుస్తోంది.  ఇక్కడి పుష్కరనిలోని నీరు సుద్దమైనది. ఎంతకాలమైనా వాసనరాదు, పాచి పట్టదు. అన్నిటికి మించి సర్వ రోగ నివారణి. ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులు రోగ నివారనార్ద్దం ఈ నీటిని తీసుకొని వెళ్ళుతుంటారు.  సుందర ప్రకృతిలో ఛిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయం సందర్శకులకు అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తుంది.  తిరుపతి, చిత్తూరు, కానిపాకంల నుండి రోడ్ మార్గంలో సులభంగా అర్ధగిరి  చేరుకోవచ్చును.  ...

Ashta Dharmasastha Temples

చిత్రం
                                  అష్ట అయ్యప్ప అవతారాలు                                                                                                                 స్వామి అయ్యప్ప అనగానే మనందరికీ కనుల ముందు కదలాడే దివ్య రూపం ఒక్కటే ! శబరి మలలో పదునెనిమిది సోపానాదిపతిగా వీర పద్మాసనం, యోగ బంధనంతో చిన్ముద్ర , అభయ హస్తాలతో భక్తులను కటాక్షించే కమనీయ రూపం. కానీ అయ్యప్ప మూల రూపమైన శ్రీ ధర్మ శాస్త యుగాల క్రిందట నుండే వివిధ రూపాలతో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా ప్రసిద్ది చెందారు. శ్రీ హరి ఆరో అవతార రూపమైన శ్రీ పరశురాముడు సృష్టించిన కేరళలో ఆయనే నెలకొల్పిన నూట ఎనిమిది ఆలయాలలో అనేక భంగిమలలో దర్శ...