Hampi
పదునాలుగవ శతాబ్దములో భారతీయ సంస్కృతుల సంరక్షణ కోసం శ్రీ విద్యారణ్య స్వామి ఆశిస్సులతో ఆరంభిచబడిన విజయనగర రాజ్యం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందినది. భారత దేశ నలుచేరుగుల విస్తరించి ఆఖండ సామ్రాజ్యాన్ని స్తాపించి మనవైన సంస్కృతులను జన బాహుల్యంలోనికి తీసుకు వెళ్ళిన ఘనత వారిదే. ఎన్నో ఆలయాలను నిర్మించడమే గాక పునరుద్ధరించి ఎన్నోకైంకర్యాలను సమర్పించుకున్నారు. తమ రాజధాని అయిన హంపి ని శత్రు దుర్భేద్యముగా తయారుచేసుకొన్నారు. క్రీస్తు శకం 1336 వ సంవత్సరంలో స్తాపించబడి 1678 దాక సాగిన వివిధ వంశ రాజుల పాలనలో ప్రజలు సుఖ శాంతులతో గడిపారు. సుల్తానుల నిరంతర దాడులతో తన సౌందర్యాన్ని కొంత పోగట్టుకొన్నహంపి నేటికి ఎన్నో అద్భుత నిర్మాణాలతో మనలను చకితులను చేస్తుంది. విఠల ఆలయం, కమల మహల్ , గజ శాల, మహానవమి గద్దె , హజార రామ ఆలయము, బాడవ లింగం . పురందర మండపము , విరుపాక్ష ఆలయము కోదండ రామ ఆలయము, ఉగ్ర నారసింహ, వీరభద్ర , నల్ల రాతి కోనేరు ఇలా ఎన్నో మాతంగ పర్వతం విఠలాలయము...