పోస్ట్‌లు

మే, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది

Narmada Pushkaraalu

చిత్రం
                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావించడం జరుగుతోంది. మన పురాణాలు కూడా అదే విషయాన్ని విపులంగా తెలిపాయి.   నింగి, నేల, నీరు, గాలి మరియు నిప్పు అన్నీ దైవస్వరూపాలే ! అలా భావించడానికి తగిన కారణాలను మన పురాణాలు సోదాహరంగా వివరించాయి.  పంచ భూతాలు ప్రతి ఒక్కటీ మానవ జీవితాలకు తప్పనిసరి. జీవనాధారం. ఒకటి ఉండి మరొకటి లేకపోతే జీవనయానం ఆగిపోతుంది. అంతటి విలువైనవి కనుకనే ప్రతి ఒక్కదానిని గౌరవించడం,  పూజించడం, కృతజ్ఞతా భావంతో ఉండటం అవసరమని పెద్దలు తెలిపారు. అలా జరగడం వలననే ఇన్ని యుగాలు, తరాల తరువాత కూడా మనందరం కొంతవరకు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాము.  ఈ పంచ భూతాలు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూడండి.  ఆకాశంలోని మేఘాల వలన కురిసిన వానలతో భూమి పులకించి చక్కని పంటలు అందిస్తుంది. పచ్చని చేల మీదగా, చెట్ల మీదగా వీచే గాలి ప్రాణవాయువు ఆహ్లదకరం. జీవనావసరం. పండిన పంటల...

Penchelakona Temple

చిత్రం
           శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పెంచెలకోన  శ్రీ నృసింహ ఆరాధన దక్షిణ భారత దేశంలో ఎక్కువ.  అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం. తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలో చాలా విశేష నృసింహ ఆలయాలు ఉన్నాయి.  మన తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక పురాతన శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయాలు నెలకొని ఉన్నాయి.   ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో స్వామి నడయాడిన క్షేత్రాలుగా పేర్కొనే నవ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అవి అహోబిళం, సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అంతర్వేది, మాలకొండ(మాల్యాద్రి), పెంచెలకోన,యాదాద్రి మరియు ధర్మపురి.   శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన సింహాచలం మరియు స్వామి లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన ప్రదేశముగా ప్రఖ్యాతి గాంచిన అహోబిళం వీటిలో మొదటి వరసలో ఉంటాయి.  ప్రతిఒక్క క్షేత్రం తమవైన పురాణ గాధలు కలిగి ఉండటం విశేషం.  నారసింహ అవతారంలో స్వామి చెంచు లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకొన్న స్థలంగా నెల్లూరు జిల్లాలోని పెంచెలకోన (పెనుశిల) ప్రఖ్యాతి గాంచినది.  క్షేత్ర గాథ  చుట్టూ పర్వతాలు. వాటి నుంచి జా...