అరుదైన విశేషాల శ్రీ సుందర కామాక్షి అమ్మన్ ఆలయం తమిళనాడు రాష్ట్ర పటంలో ఈ గ్రామానిది చాలా చిన్న స్థానం. అనేకానేక పల్లెలలో ఒకటి. కానీ గతంలో ఒక గొప్ప స్థానం పొందిన గ్రామంగా చరిత్రలో సుస్థిర కీర్తి పొందినది సిరుకరంబనూర్. దానికి ముఖ్యకారణం ఇక్కడ ఉన్న శ్రీ సుందర కామాక్షీ సమేత శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి వార్ల ఆలయం. సుమారు పది లేదా పదకొండవ శతాబ్దాల కాలానికి చెందిన ఈ ఆలయం చోళ రాజుల నిర్మితంగా తెలుస్తోంది. నిర్మాణశైలి, లభించిన ఒకటవ రాజరాజ చోళుని శాసనాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. గొప్ప చరిత్ర, ఆకర్షించే శిల్పకళ, అనేక ప్రత్యేకతలు కలిసి ఈ ఆలయాన్ని ఒక విశేష దర్శనీయ స్థలంగా మార్చాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం సుమారు ఒకటిన్నర శతాబ్దం పాటు భూమిలో ఉండిపోయినది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. 1958వ సంవత్సరంలో పెద్ద ఇసుక గుట్ట క్రింద ఉన్న ఈ నిర్మాణాన్ని వెలికి తీశారు. ఇలా ఆలయాన్ని భూమిలో దాచిపెడటానికి గల కారణం ఏమిటంటే ఆ సమయంలో నిరంతరం జరిగిన పరాయి మతస్థుల దండయాత్రలు. వాటి నుండి తమ ఆరాధ్య దైవం కొలువు త...