పలయూర్ - ప్రచారకుని ప్రధమ మజిలి = ఇలపావులూరి వెంకటేశ్వేర్లు "భారత దేశము నా మాత్రు భూమి, భారతీయులందరూ నా సహోదరులు." అంటూ కారు దిగి లోపలికి నడుస్తూ నా కేరళా మిత్రుడు శయన్ తో అన్నాను. దీనికి నేపద్యం ఏమిటంటే ప్రతి సంవత్సరం మాదిరిగానే శబరిమల యాత్ర చేసుకొని తిరుగు ప్రయాణంలో గురువాయూర్ వచ్చాము నేను, నే ఇద్దరు మిత్రులు. అక్కడ ఉండే శయన్ మమ్ములను రిసీవ్ చేసుకొని తన కారులో గురువాయూర్ లోని కొన్ని పురాతన ఆలయాలను చూపిస్తున్నప్పుడు నేను పలయూర్ చర్చి గురించి అడిగి, చూడాలని ఉన్నది అన్నాను. నా వంక అదోలా చూస్తూ" నువ్వా !" అన...